నా కొడకా ఎవడ్రా నువ్వు, ఉచ్చ పోయిస్తా నేను తలుచుకుంటే | బాబు గోగినేని ని తిట్టి గోల గోల చేసిన వేణు స్వామి

నా కొడకా ఎవడ్రా నువ్వు, ఉచ్చ పోయిస్తా నేను తలుచుకుంటే | బాబు గోగినేని ని తిట్టి గోల గోల చేసిన వేణు స్వామి
ఓ జ్యోతిష్కుడి బండారాన్ని ఓ హేతువాది బయటపెట్టి సంచలనం సృష్టించారు. ఇది ఇప్పుడు టాక్ ఆఫ్ ద సిటీగా మారింది. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ చర్చలో జ్యోతిష్కుు వేణు స్వామికి, హేతువాది బాబు గోగినేనికి మధ్య చర్చ సాగింది. ఆ చర్చలు చివరకు తాను చెప్పిందంతా జరగదని వేణు స్వామి చెప్పాల్సిన స్థితికి వచ్చారు. మహా న్యూస్ చానెల్ నిర్వహించిన చర్చలో చివకు "నా పేరు వేణు స్వామి. నా అంచనాలు నిజం కావు. నేను చెప్పింది ఏదీ నిజం కాదు. నన్ను విశ్వసించవద్దు" అని చెప్పాల్సిన పరిస్థితికి వచ్చారు.ఆస్ట్రో గురు వేణు స్వామి ప్రధాని నరేంద్ర మోడీని తాను కలిసినట్లు ఓ ఫొటో పెట్టుకున్నారు.  
అది మార్ఫింగ్ చేయించుకున్న ఫొటో అని బాబు గోగినేని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇంతకు ముందు వేణు స్వామి పలు టీవీ చానెళ్లలో కనిపిస్తూ తాను చెప్పే జ్యోతిషంలో 90 శాతం వరకు నిజమవుతాయని చెప్పుకుంటూ వచ్చారు. కానీ, బాబు గోగినేని ధాటికి తట్టుకోలేక తాను చెప్పేవి జరగవని అంగీకరించాల్సి వచ్చింది.ప్రధాని మోడీని కలిసినట్లు వేణుస్వామి వెబ్‌సైట్‌లో పెట్టిన ఫొటో మార్ఫింగ్ చేసిందని గోగినేని బాబు నిరూపించారు. వేణు స్వామి అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని కలవలేదని కల్యాణ్ గుత్తికొండ అనే వ్యక్తి పెట్టుకున్న ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నారు. దానికిప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం వచ్చంది. దాన్ని గోగినేని కూడా ఆయన ఆధారంగా చూపించారు. తాను మోడీని కలిసినట్లు పెట్టుకున్న ఫొటో వాస్తవం కాదని వేణు స్వామి అంగీకరించాల్సి వచ్చింది, అయితే అది తాను చేసింది కాదని ఓ వార్తా పత్రిక ప్రచురించిందని చెప్పారు. అయితే ప్రధాని మోడీని తాను కలిసిన మాట వాస్తవమేనని, ఎక్కడ ఎప్పుడు కలిశాననేది చెప్పాల్సిన అవసరం లేదని కూడా వేణు స్వామి వాదించారు.

Comments