అసలు నువ్వు ఎవడ్రా పవన్ కళ్యాణ్ ని అనడానికి | లైవ్ లో మహేష్ కత్తి తో గొడవ పడ్డ గబ్బర్ సింగ్ సాయి

అసలు నువ్వు ఎవడ్రా పవన్ కళ్యాణ్ ని అనడానికి | లైవ్ లో మహేష్ కత్తి తో గొడవ పడ్డ గబ్బర్ సింగ్ సాయి 
హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి మరోసారి విరుచుకుపడ్డారు. వరుసగా ఆయన ఫేస్‌బుక్ వేదికగా పవన్ కల్యాణ్‌పై విమర్శలు కురిపిస్తూ వస్తున్నారు. అంతా అభిమానుల చేతుల్లోని ఉందని మహేష్ కత్తి ఇంతకు ముందు అన్నారు. అయితే తాజాగా తన విమర్శల జడివానను మళ్లీ కురిపించడం ప్రారంభించారు. "ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మొయ్యాలి. మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో... చేగువేరా ఎక్కడికి పోయాడో... ఈ బానిస ఫ్యూడల్ భావజాలాన్ని పెంపొందించే కమ్యూనిస్టు ఎవరో... హతవిధి! ఏమిటీ మీమాంస?, అజ్ఞాతవాసికి అగ్న్యాతవాసికి తేడా ఉంది త్రివిక్రమ్ గారూ!" అని మహేష్ కత్తి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
అజ్ఞాతవాసి సినిమాపై మహేష్ కత్తి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ పర్యటన అటు చంద్రబాబుకు, ఇటు పవన్‌ ‘అజ్ఞాతవాసి' సినిమాకు కలిసొచ్చిందని అన్నారు. స్వామికార్యం స్వకార్యం అంటే జనాలు ఫీల్ అయ్యారుగాని, టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ పాస్‌ల కోసం కొట్టుకుంటున్న విధానం చూస్తుంటే, పవన్ కళ్యాణ్ పర్యటన అటు చంద్రబాబుకు ఇటు కళ్యాణ్ బాబుకు ఇద్దరికీ వర్కౌట్ అయినట్లేగా అని అన్నారు. "ఒకే దెబ్బకి రెండు పిట్టలు. రాజకీయానికి రాజకీయం. సినిమాకి సినిమా. కొన్ని కోట్ల ప్రమోషన్ ఆటోమేటిక్ గా జరిగిపోతేను!" అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఆయన పోస్టు కలకలం రేపుతోంది. పవన్‌ అభిమానులకు మహేశ్‌ కత్తికి సోషల్‌ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. మహేశ్‌ కత్తి మరోసారి ఫైర్‌ కావడానికి పవన్‌ కల్యాణ్ అభిమానులే కారణమణని అంటున్నారు.

Comments